వన్డే ఫార్మాట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్

by Disha Web Desk 13 |
వన్డే ఫార్మాట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ఫార్మాట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏడు గంటలు కూర్చొని వన్డే మ్యాచ్ చూసే టైమ్ ఎవరికీ లేదని.. భవిష్యత్తు మొత్తం టీ20, టీ10 లీగ్స్‌దే అని స్పష్టం చేశాడు. రానున్న రోజుల్లో మరిన్ని టీ10 లీగ్స్ కూడా వస్తాయన్నది నా నమ్మకం. అంతేకాదు క్రికెట్ ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్న జర్మనీ, చైనా లాంటి అసోసియేట్ దేశాల్లో టీ10 బాగా ఆకర్షిస్తుందని ఉతప్ప అన్నాడు. ఎందరో మాజీ క్రికెటర్లు కూడా 50 ఓవర్ల ఫార్మాట్ ఇక కనుమరుగు కావడం ఖాయమన్నారు.

Next Story